నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:39

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు

ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు

ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు

జీఓ జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:37

దళారుల చేతిలో ధరలు

- మొక్క జొన్న ధరలు పతనం

మార్కెట్‌లో రూ. 2200 నుంచి రూ.1800లకు తగ్గుదల

- వ్యాపారులు సిండికేట్‌గా మారిన వైనం

- కానరాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

పంట ఏదైనా రైతుల చెంతకు రాగానే ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు పత్తి, మిర్చిలో సిండికేట్‌గా మారిన వ్యాపారులు.. ఇప్పుడు మొక్కల కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్నారు. వారం రోజుల కిందట మొక్కజొన్న క్వింటాకు రూ.2200 ధర ఉండగా ఇప్పుడు రూ.1800లకు చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల మార్కెట్‌లో వ్యాపారులదే ఇష్టారాజ్యం అయింది. ధరలు పెరగకుండా వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కొనుగోళ్లను నిలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదనే ప్రచారం చేస్తున్నారు. దాంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాకు రూ. 2500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ మధ్ధతు ధర క్వింటాకు రూ.1960 ఖరారు చేసింది.

అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దాంతో రూ.1800కే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారుల చేతిలో రైతులు నష్ట్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి యాసంగిలో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. తాడూరు మండల పరిధిలోనే సుమారు 18,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. తెల్కపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో 150 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్‌లో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి పంటను అధికంగా సాగు చేశారు.

కౌలు రైతుల పరిస్థితి దయనీయం

మొక్క జొన్న సాగులో కౌలు రైతులే కీలకంగా ఉన్నారు. ఒక్కో ఎకరాకు రూ.పది వేలు చెల్లించి లీజుకు తీసుకున్నారు. ఎకరా పెట్టుబడి రూ.25 వేలకు దాటింది. లీజుతో కలుపుకొని మొత్తం రూ. 35వేలు అయ్యింది. 25 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న దిగుబడి 25 శాతం తగ్గడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. కాగా, పంట పూర్తిగా చేతికి వచ్చి కల్లాల్లో ఉన్నా నేటికీకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పెట్టుబడి అయినా..రావడం లేదు

నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాను. కౌలుతో కలుపుకొని సుమారు రూ.1.60లక్షలు పెట్టుబడి అయింది. గతేడాది రూ.2500 అమ్మగా, ఈసారి రూ.1800కు పడిపోయింది. పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదు.

- బాలస్వామి, తాళ్లపల్లి, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

పత్తి వేసి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉంది. గతేడాది రూ. 2500లు ఉన్నది. ఈసారి 1800లకు పడిపోయింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.

- శ్రీనివాసులు, రైతు సంఘం

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:34

నేడు సూర్యగ్రహణం.. నాలుగు రాశుల వారు ఈ విషయాల్లో జాగ్రత్త

నేడు సూర్యగ్రహణం. ఈ ఏడాది ఏప్రిల్ 20 గురువారం అమావాస్య రోజున సూర్యగ్రహణ ఏర్పడనుంది. ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది.

అంటే దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు.

ఇక ఈ సూర్యగ్రహణం రోజు కొన్నిగ్రహాల కలయిక జరుగుతుంది. అందువలన నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ సూర్యగ్రహణం ఏ రాశులపైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి :

మేష రాశివారు సూర్యగ్రహణం రోజు శుభకార్యాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలే మంచిది కాదంట. గ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వలన వీరు ఆర్థిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయంట. అంతే కాకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతాయంట. అందువలన ప్రతీ విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలంటున్నారు పండితులు. ఇక వీరు శివనామస్మరణ చేయడం చాలా మంచిదంట.

కన్యరాశి:

ఈ రాశి వారు సూర్యగ్రహణం రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

మకర రాశి :

ఈరాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు అలాగే నిలిచిపోతాయి. ఇక గ్రహణం ఉన్నందున కొత్త పనులేవీ ప్రారంభించకూడదు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:31

నేటితో పూర్తికానున్న ఇంటర్‌ వాల్యుయేషన్‌

గత పది రోజుల క్రితం ప్రారంభమైన ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియ నేటితో పూర్తికానుంది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 3 వరకు జరిగాయి.

పది పరీక్షలు ఏప్రిల్‌ ఆరున ప్రారంభమై నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఇంటర్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ పదవ తేదీ నుంచి ప్రారంభమైంది. తిరుత్తణిలోని గెంగుస్వామి నాయుడు మెట్రిక్‌ పాఠశాల, తిరువళ్లూరులోని డీఆర్‌బీసీసీ, ఆవడిలోని ఎయిడెడ్‌ పాఠశాల మూడు కేంద్రాల్లో జరిగింది. మొత్తం ఆరు వందల మంది ఉపాద్యాయులు వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు.

ఇంటర్‌ వాల్యుయేషన్‌ నేటితో ముగియనుండడంతో శుక్రవారం నుంచి విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇలావుండగా పది పరీక్షలు నేటితో ముగియనున్న నేపథ్యంలో 24 నుంచి వాల్యుయేషన్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం తిరుత్తణి, తిరువళ్లూరు, ఆవడిలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాల్యుయేషన్‌ ప్రక్రియ 15 రోజుల పాటు సాగే అవకాశం వుంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:14

Andhra News: ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణకు మరోసారి నోటీసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది..

సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

గతంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అదనపు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భందించి ఆందోళన చేయడంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు నోటీసులు జారీ చేస్తూ.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది..

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:12

Population: భారత్‌ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

దిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..

ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస (United Nations) బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.

జనాభా అంచనాలకు సంబంధించి 'స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023' పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ (UNFPA) తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది.

మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 19:10

Mysore Fire Accident: మైసూరులో భారీ అగ్నిప్రమాదం.. ఏకంగా రెండు కీలోమీటర్ల మేర..

A Fire Broke Out In A Firecracker Factory In Hubli Industrial Park: మైసూరులో ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించడంతో..

రెండు కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో.. స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవ్వడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్‌ పార్క్‌లో ఒక ప్రైవేటు గోడౌన్ ఉంది.

అందులో క్రాకరీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగడంతో.. అందరూ బతుకుజీవుడా అంటూ పరుగులు పెట్టారు. అది క్రాకరీ ఫ్యాక్టరీ కావడంతో.. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.

బాణాసంచాలన్ని పేలడంతో.. మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి.. చుట్టుపక్కల ఉన్న 50కి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పేలుడు ధాటికి రెండు కీలోమీటర్ల దూరం వరకు ప్రభావితం అయినట్లు తెలిసింది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 17:44

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గురూజీ

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ గారు. నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్, సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు.

ఈరోజు పెద్దకాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ సుదర్శన క్రియ ప్రోగ్రాం ల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసరావు గురూజీ గారిచే సుదర్శన్ క్రియ యోగ మెడిటేషన్ కార్యక్రమాలు గత నాలుగు రోజులుగా పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది.

శ్రీనివాస్ రావు గురూజీ మాట్లాడుతూ జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో మార్పు రావాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా హ్యాపీనెస్ సుదర్శన క్రియ సాధనను నేర్చుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప శ్వాస ప్రక్రియ సుదర్శన క్రియ అని కొనియాడారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా సుదర్శన్ క్రియ చేయాలని దీని ద్వారా మన మనసు మన ఆధీనంలో ఉంటూ మన శ్వాస ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోగలమని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు.

సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మొహం, ఉబ్బసం మొదలగు రోగాలను అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైనసైటిస్, చర్మవ్యాధులు గ్యాస్టిక్ సమస్యలు మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారికి 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. ప్రతి ఒక్కరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా హ్యాపీనెస్ కోర్స్ చేసి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందారు.మనసుకు శరీరానికి మధ్యలో శ్వాస ఉంటుంది ఆ శ్వాసను పట్టుకుంటే ఆనందం ఆరోగ్యం మీ సొంతమవుతుంది అని గురూజీ అన్నారు.

ఈ హ్యాపీనేస్ కోర్సు ద్వారా మీ జీవితంలో కొత్త మార్పు మొదలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ కిషోర్, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం నరేష్, మైల సత్తయ్య, నారాయణ రమేష్, జీ. నాగచారి,చంద్రయ్య, మోర ధనుంజయ్, గుండెబోయిన నరసింహ, మర్రి హరీష్ రెడ్డి, రాచమల్ల జానయ్య, లడే రాములు, ఆవుల జానయ్య వెంకటేష్, సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, పాకాల దినేష్, బెలిజ సత్యనారాయణ, ఉయ్యాల లింగస్వామి, రాచమల్ల శ్రీనివాస్, మాధగొని లింగస్వామి, పాకాల సత్యనారాయణ, సిలువేరు వెంకటేష్, శిలువేరు శివయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 19 2023, 17:37

BREAKING : టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు..పుష్ప షూటింగ్ రద్దు !

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు..

జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే..

సుకుమార్ ఇంట్లో తాజాగా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారని సమాచరం..

నిజంనిప్పులాంటిది

Apr 18 2023, 21:48

తెలంగాణలో మరో కొత్త పార్టీ ... "తెలంగాణ నిర్మాణ పార్టీ"

చర్లపల్లి జైలు ముందే పార్టీ పేరు ప్రకటించిన తీన్మార్ మల్లన్న.

చర్లపల్లి జైలు నుంచి విడుదలైన క్యు న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న తాను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

కేసులు సెక్షన్ గా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

వీకర్ సెక్షన్ గా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారన్నారు వచ్చే నాలుగు నెలల్లో తెలంగాణలో కేసీఆర్ పేరు వినీపించకోకుండా చేస్తామన్నారు.